మార్గదర్శకులు

పూజ్య డాక్టర్ ప్రణవ్ పాండ్యా (డాక్టర్ సాహెబ్)
సంస్థానాధిపతి : అఖిల విశ్వ గాయత్రీ పరివారము
సంచాలకులు : బ్రహ్మవర్చస్ పరిశోధనా సంస్థ
రాజపండితులు : దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము
సంపాదకులు : అఖండజ్యోతి - మాసపత్రిక
సభాపతి : స్వామి వివేకానంద యోగవిద్యా మహాపీఠము


పట్టభద్రులు, పదవులు మరియు పరిశోధనలు :

1972 : ఎం.బి.బి.ఎస్., ఎం.జి.ఎం. మెడికల్ కాలేజ్, ఇండోర్
1975: డాక్టర్ ఆఫ్ మెడిసిన్ - స్వర్ణపతక గ్రహీత
1975-1976: డిపార్టమెంట్ ఆఫ్ న్యూరాలజీ మరియు కార్డియాలజీలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి ఎం.జి.ఎం. మెడికల్ కాలేజ్లో పని చేసారు. "ట్రీట్మెంట్ ఆఫ్ సైకో సొమాటిక్ డిసీసెస్" అనే అంశముపై తమ పరిశోధనా పత్రములను ప్రచురించారు.
1976-1978 : బి.హెచ్.యి.ఎల్. భోపాల్, హరిద్వార్ వైద్యాలయములో ఫిజీషియనుగా, మరియు ఇంటెన్సివ్ కేర్ విభాగమునకు 'ఇంచార్జ్' బాధ్యతలను స్వీకరించారు.
1978 : భారత సంప్రదాయ సేవలో గడుపుటకు అమెరికా సంయుక్త రాష్ట్రములలో అనేక ఉద్యోగ అవకాశములను, ప్రతిపాదనలనూ త్రోసిపుచ్చి భారత దేశములోనే బ్రహ్మవర్చస్ పరిశోధనా సంస్థకు నిర్వాహకులుగా స్థిరపడినారు.
2002 : నుండి దేవ సంస్కృతీ విశ్వవిద్యాలయ సంచాలకులు.


మానవీయతకు సేవ :

1978 : నుండి శాంతికుంజ్, హరిద్వార్ ముఖ్య కార్యాలయములో నవయుగ నిర్మణములో మానవతా సేవకు అంకితమైనారు.
1974-1990 : వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు వ్యక్తిత్వ వికాసము, నీతి నడవడికల అధ్యయన, శిక్షణా కార్యక్రమములకు బాధ్యత వహించి 35000 మందికి పైగా అధికారులకు శిక్షణ ఇచ్చారు.
1992 : ఫిబ్రవరిలో ఇంగ్లాండు నందు హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్లను ఉమ్మడిగా సంభోదించారు.
1993 : చికాగోలో (అమెరికా సంయుక్త రాష్ట్రములు) 1999లో కేఫ్ టౌన్ (దక్షిణ అమెరికా) లలో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్ సమావేశములలో భారతీయ సంస్కృతి వెనుక గల విఙ్ఞానమును గురుంచి తెలియపరిచారు.
1994 : తమ దర్శకత్వములో "వాటర్షెడ్ డెవలప్మెంట్ స్కీం" ను (వర్షపు నీటి సేకరణ, వ్యవసాయము) దేశ వ్యాప్తముగా ప్రచారము చేసారు.
1999-2000 : విస్తృత, దేశ, విదేశయాత్రలు జరిపి, వైఙ్ఞానిక సమ్మతమైన అనేక ఆధ్యాత్మిక విషయ సంబంధిత కార్యక్రమములను పెద్ద ఎత్తులో నిర్వహించారు.


అమెరికా సంయుక్త రాష్ట్రములు, కెనెడా, ఇంగ్లాండు మొదలగు దేశములలో గాయత్రీ పరివార శాఖలను స్థాపించారు. భారతీయ సంస్కృతి యొక్క సందేశమును విశ్వవ్యాప్తి జేయుటకు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా తదితర యూనివర్సిటీల యందు సమావేశములో పాల్గొని, సెమినార్లను నిర్వహించినారు.


పూజ్య శ్రీమతి శైల్ బాలా పాండ్యా (శైల్ జీజి)
పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాతా భగవతీ దేవీగార్ల సుపుత్రిక
జన్మ వివరములు : తెల్లవారు ఝామున డిసెంబరు 20, 1953 (గీతా జయంతి), అఖండ జ్యోతి సంస్థానము, ఘియామండి, మథుర.


ఆధ్యాత్మిక వాతావరణములో, తల్లిదండ్రుల ఆశయాలకు పూర్తి సమర్పణలో పెరిగినారు. విశ్వవిద్యాలయము నందు ఎన్.సి.సి., తదితర కార్యక్రమములలో చురుకుగా పాల్గొన్నారు. ఇండోర్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీ యందు పరిశోధనా దృక్పథముతో, వినూత్న ప్రక్రియలు జరిపారు.


కోశాధికారి: శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్ట్, శాంతికుంజ్, హరిద్వార్.
ప్రస్తుత సంస్థానాధిపతి : శాంతికుంజ్, ముఖ్యకార్యాలయము, అఖిల విశ్వ గాయత్రీ పరివార్, యుగ నిర్మాణము, విచార్ క్రాంతి అభియాన్.
అఖిల విశ్వ గాయత్రీ పరివార్ అధ్యక్షులైన శ్రీ ప్రణవ్ పాండ్యాగారి శ్రీమతి.
ఆమె జీవితములో మైలు రాళ్ళు: మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, దేవీ అహల్య యూనివర్సిటీ, ఇండోర్, ఇండియా.
భర్తయైన శ్రీ ప్రణవ్ పాండ్యాగారితో, శాంతికుంజ్ బృందముతో కలిసి పనిచేయుటకై ఇండోర్ను వదిలి తన ఒకటిన్నర సంవత్సరముల బాలుడు చిన్మయ్తో కలిసి 1978 ఫిబ్రవరిలో గురుసత్తా పిలుపునందుకొని విశ్వవ్యాప్త గాయత్రీ ఆందోళనయందు పాల్గొనినారు.

TOP